Sunday 14 August 2016

కొత్త జిల్లాల ఏర్పాటుపై నివేదిక తయారు: కడియం

కొత్త జిల్లాల ఏర్పాటుపై నివేదిక తయారు: కడియం
హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటుపై కేబినెట్‌ సబ్‌కమిటీ భేటీ ముగిసింది. ఈ కమిటీ మూడు రోజులపాటు 10జిల్లాల నేతలతో సమావేశాలు నిర్వహించింది. ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తెలుసుకున్న సబ్‌కమిటీ. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కడియం మాట్లాడుతూ 10 జిల్లాల్లో సేకరించిన నివేదికను త్వరలో సీఎం కేసీఆర్‌కు అందజేస్తామని అన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై అన్నీ పార్టీల ప్రజాప్రతినిధుల అభిప్రాయం పరిగణలోకి తీసుకుంటామని ఆయన అన్నారు. దీని కోసం నిర్వహించే అఖిలపక్ష సమావేశం తేదీని త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని కొందరు లిఖిత పూర్వకంగా కోరారని ఆయన తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త జిల్లాల ఏర్పాటు ఉండబోతోందని ఆయన పునరుద్ఘాటించారు. పాలనా సౌలభ్యం కోసమే జిల్లాల విభజన చేస్తున్నట్లు కడియం స్పష్టం చేశారు.



No comments:

Post a Comment