Sunday 14 August 2016

కనుల పండువగా కృష్ణా హారతి


కనుల పండువగా కృష్ణా హారతి 
న్యూస్‌టుడే, శ్రీరామ పాదక్షేత్రం ఘాట్‌ (నాగాయలంక): నాగాయలంక శ్రీరామ పాదక్షేత్రంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న కృష్ణా హారతి కార్యక్రమం కనులపండువగా సాగింది. శనివారం కృష్ణానదికి పుష్కర కమిటీ ఆధ్వర్యంలో వేదపండితులు నవ హారతులతో హారతిని సమర్పించగా నాగాయలంక, సమీప మండలాల నుంచి వేలసంఖ్యలో భక్తులు హాజరు కావటంతో శ్రీరామ పాదక్షేత్రం ఘాట్‌ భక్తులతో కిక్కిరిసి పోయింది. నాగాయలంక తహశీల్దార్‌ ఎస్‌.నరసింహారావు, శ్రీ దుర్గా గణపేశ్వర స్వామి ఆలయ కార్యనిర్వహణాధికారి తిక్కిశెట్టి వీరవెంకట మోహన్‌ రావు, దివి మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ మండవ బాలవర్దిరావు ఆధ్వర్యంలో హారతి కనులపండువగా సాగింది. ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్‌ సతీమణి విజయలక్ష్మి, కుమారుడు వెంకట్రామ్‌ పుష్కర యాత్రికులతో కలిసి తిలకించగా పుష్కర కమిటీ పెద్దలు చిట్టా సాంబశివరావు, మాదివాడ నిరంజన్‌ రావు, డాక్టర్‌ ఏవీఎల్‌ నారాయణ, ఆలూరి శ్రీనివాసరావు, సర్పంచి శీలి రాము తదితరులు పర్యవేక్షించారు. కార్యక్రమంలో జిల్లా తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి తలశిల స్వర్ణలత, ఎంపీపీ సజ్జా గోపాలకృష్ణ సతీమణి శివపార్వతి, ఎంపీడీవో ఆనందరావు, తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment