Sunday 14 August 2016

నంద్యాలలో విషాదం..


నంద్యాలలో విషాదం..

నంద్యాల : కర్నూలు జిల్లా నంద్యాలలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. స్థానిక ప్రథమనంది ఆలయ సమీపంలో ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.

రాయల్ కంపౌడ్‌కు చెందిన రాంప్రసాద్(43), సత్యవతి(38) దంపతులు ఆలయ సమీపంలోని పంటపొలాల్లో ఇద్దరు పిల్లలతో కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలో తల్లిదండ్రులు అక్కడికక్కడే మృతిచెందగా.. శోభ(14), విజయ్ కృష్ణ(12) అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఇది గుర్తించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించడానికి యత్నించగా.. మార్గ మధ్యలోనే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.




No comments:

Post a Comment